News April 12, 2024

MLAగా ఓడి MPగా బరిలోకి..

image

TG: కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఆరూరి రమేశ్, రఘునందన్ రావు, నీలం మధు, RS ప్రవీణ్ కుమార్ వంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.

Similar News

News March 25, 2026

అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

image

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.

News March 24, 2026

RCB అమ్మకం.. కొత్త ఓనర్ ఎవరంటే?

image

RCB జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్, US కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్‌, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు $1.78Bతో(₹16,706Cr) ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్(Diageo) యజమానిగా ఉంది.

News March 24, 2026

ఇరాన్-US చర్చలకు సిద్ధమన్న పాక్.. స్పందించిన ట్రంప్!

image

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. దీనిపై పాక్ PM షరీఫ్ చేసిన ట్వీట్‌ను US అధ్యక్షుడు ట్రంప్ రీపోస్ట్ చేశారు. పరోక్షంగా పాక్ రిక్వెస్ట్‌ను స్వాగతించారు. మరోవైపు ఇస్లామాబాద్‌కు US ఉపాధ్యక్షుడు JD వాన్స్ వెళ్తున్నట్లు Axios మీడియా సంస్థ తెలిపింది. అక్కడ ఇరాన్ ప్రతినిధులతో విట్కాఫ్, కుష్నెర్‌తో కలిసి చర్చల్లో పాల్గొంటారని వెల్లడించింది.