News May 22, 2024
పేటీఎంను వెంటాడుతున్న నష్టాలు

ఫిన్ టెక్ సంస్థ పేటీఎం FY24ను నష్టాలతో ముగించింది. చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.550 కోట్ల నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది క్యూ4 ఫలితాల్లో ఈ నష్టం రూ.169కోట్లకే పరిమితమైంది. మరోవైపు ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ (రూ.2,267కోట్లు) సైతం అంతకుముందు ఏడాదితో (రూ.2334 కోట్లు) పోలిస్తే 3శాతం తగ్గిపోయింది. యూపీఐ చెల్లింపులు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై RBI ఆంక్షలు క్యూ4 ఫలితాలపై ప్రభావం చూపించాయి.
Similar News
News November 14, 2025
సంగారెడ్డి: అన్నం గిన్నెలో కాలు పెట్టిన వాచ్మన్పై వేటు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పాలిటెక్నిక్ కళాశాల ఎస్సీ, ఎస్టీ వసతి గృహం వాచ్మెన్ దారుణానికి పాల్పడ్డాడు. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న వాచ్మన్ శేఖర్ అన్నం గిన్నెలో మద్యం తాగి కాలు పెట్టాడు. ఫిర్యాదుల మేరకు కళాశాల ప్రిన్సిపల్ నివేదికను కలెక్టర్కు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు.
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.
News November 14, 2025
కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.


