News March 17, 2024
మేడారంలో వస్తువులు మాయం!
మేడారం మహా జాతర సమయంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో వినియోగించిన పలు రకాల విలువైన వస్తువులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జాతర సమయంలో వీవీఐపీలు, వీఐపీలకు భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు కనిపించడం లేదు. వీటిలో డిన్నర్ సెట్లు, మిక్సీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్, డైనింగ్ సెట్లు తదితర వస్తువులు జాతర ముగిసిన అనంతరం రాత్రికి రాత్రే మాయం కాగా.. దీనిపై విచారణ జరుగుతోంది.
Similar News
News October 29, 2024
జాతీయస్థాయి సెమినార్కు వరంగల్ విద్యార్థి
చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ZPHS 9వ తరగతి విద్యార్థి భూర వినయ్ కుమార్ ఈరోజు హైదరాబాదులోని SCERTలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్లో మొదటి స్థానం కైవసం చేసుకొన్నాడు. నవంబర్ 26న ముంబైలోని నెహ్రూ సైన్స్ సెంటర్లో జరిగే జాతీయ స్థాయి సైన్స్ సెమినార్కు ఎంపికయ్యాడని వరంగల్ DEO మామిడి జ్ఞానేశ్వర్, WGL జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలిపారు.
News October 29, 2024
RTC వరంగల్ రీజియన్కు ఎలక్ట్రిక్ బస్లు
ఆర్టీసీ వరంగల్ రీజియన్కు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్లు వస్తున్నాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డీ.విజయ భాను తెలిపారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్, సెమీడీలక్స్ మొత్తం 82 బస్లు వస్తున్నాయన్నారు. వీటిని హనుమకొండ నుంచి HYD, నిజామాబాద్, KNR, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం రూట్లలో నడుపనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. వచ్చే నెలలో నడుస్తాయన్నారు.
News October 29, 2024
WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 28 మందికి భారీ జరిమానా
వరంగల్ ట్రాఫిక్ PS పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ నలుగురు వాహనదారులకు మంగళవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి రూ.5,000 జరిమానా విధించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 28 మందికి రూ.36,100 జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే.రామకృష్ణ తెలిపారు.