News March 17, 2024
మేడారంలో వస్తువులు మాయం!
మేడారం మహా జాతర సమయంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో వినియోగించిన పలు రకాల విలువైన వస్తువులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జాతర సమయంలో వీవీఐపీలు, వీఐపీలకు భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు కనిపించడం లేదు. వీటిలో డిన్నర్ సెట్లు, మిక్సీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్, డైనింగ్ సెట్లు తదితర వస్తువులు జాతర ముగిసిన అనంతరం రాత్రికి రాత్రే మాయం కాగా.. దీనిపై విచారణ జరుగుతోంది.
Similar News
News July 5, 2024
KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
కేయూసీ పీఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్కు అందజేశారు.
News July 5, 2024
మరో మైలురాయికి చేరువగా జనగామ ప్రభుత్వ డిగ్రీ కళాశాల!
జనగామ ఆంధ్ర భాషాభివర్ధిని (ABV) ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో మైలు రాయిని చేరుకోబోతోంది. జిల్లాలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉన్న ఈ కాలేజీకి ఈ విద్యా సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి హోదా వస్తుందని ఆశిస్తున్నారు. UGC నిబంధనలను అనుసరించి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతిపాదనలను UGCకి, కేయూ రిజిస్ట్రారు, కళాశాల అభివృద్ధి కమిటీ డీన్కు సమర్పించినట్లు తెలుస్తోంది.
News July 5, 2024
నర్సింహులపేట: ఇద్దరు యువకుల మృతి.. కేసు నమోదు
MHBD జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో అనుమానాస్పద స్థితిలో శ్రవణ్ (25), రహీమ్ (24) అనే ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయమై స్థానిక పోలీసులకు బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి కల్తీ కల్లు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.