News April 2, 2025
ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
Similar News
News February 1, 2026
మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ నిమ్స్లో వారం రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. JAN 23న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక కిడ్నీ తొలగించారు.
News February 1, 2026
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నేటి నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లను, ఒకేషనల్ సబ్జెక్టుల కోసం 624 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని తొలగించారు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులు అదే కళాశాలలో ఎగ్జామ్ రాయొచ్చు.
News February 1, 2026
ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.


