News April 15, 2025

డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

image

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.

Similar News

News March 1, 2026

ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: పుతిన్

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. ఈ హత్య కిరాతకమైన చర్య అని పేర్కొన్నారు. నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ఇరాన్ సన్నిహితుడు మసూద్ పెజెష్కియాన్(ప్రెసిడెంట్)కు రాసిన లేఖలో పేర్కొనట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడిలో ఖమేనీ హతమైన విషయం తెలిసిందే.

News March 1, 2026

వేసవి ఆరంభంలోనే పీక్ స్టేజ్‌కి విద్యుత్ డిమాండ్

image

TG: వేసవి ఆరంభంలోనే ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే రాష్ట్రంలో విద్యుత్ డిమాండూ పెరిగిపోతోంది. శనివారం 6057 MW గరిష్ఠ డిమాండ్‌ నమోదు కాగా నేడు దాన్ని దాటి 6267 MWకు చేరుకుంది. రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగి డిమాండూ అధికమయ్యే పరిస్థితి ఉందని NPDCL CMD వరుణ్ రెడ్డి తెలిపారు. అయితే ఇబ్బందులు తలెత్తకుండా డిమాండ్‌కు తగ్గ విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

News March 1, 2026

భారత్ ఘోర ఓటమి.. సిరీస్ వైట్ వాష్

image

హోబర్ట్ వేదికగా ఇండియా ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ 185 రన్స్ తేడాతో గెలిచింది. 410 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన IND 224 పరుగులకు ఆలౌటైంది. స్నేహ్ రాణా(44) టాప్ స్కోరర్. AUS బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లతో సత్తా చాటారు. అంతకుముందు అలీసా హీలీ(158), బెత్ మూనీ(106) సెంచరీలు చేయడంతో ఆసీస్ 409-7 స్కోర్ చేసింది. ఈ విజయంతో 3 మ్యాచుల ODI సిరీస్‌ను AUS వైట్ వాష్ చేసింది.