News April 5, 2025
LRS క్రమబద్ధీకరణ పారదర్శకంగా నిర్వహించాలి: పింకేష్ కుమార్

జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ఆకస్మిక తనిఖీ చేసి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలించాలన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పూర్తిచేయాలని ఆదేశించారు.
Similar News
News October 23, 2025
మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>
News October 23, 2025
ఎంజీయూ బీఈడీ ఫలితాలు విడుదల

ఎంజీయూ బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 4వ సెమిస్టర్లో 2,552 మందికి గాను 2,419 మంది (94.79%) ఉత్తీర్ణత సాధించారని సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2వ సెమిస్టర్లో 81.14 శాతం విజయం సాధించినట్లు పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News October 23, 2025
భారత్ ఓటమి

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.