News April 5, 2025
LRS క్రమబద్ధీకరణ పారదర్శకంగా నిర్వహించాలి: పింకేష్ కుమార్

జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణపై ఆకస్మిక తనిఖీ చేసి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలించాలన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పూర్తిచేయాలని ఆదేశించారు.
Similar News
News December 2, 2025
సూర్యాపేట జిల్లా ఎస్పీ హెచ్చరిక

జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పండుగలా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తోందని, మొత్తం 486 గ్రామాలకు గాను, 170 సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
News December 2, 2025
జగిత్యాల: సర్పంచ్, వార్డు పోటీదారుల DEALS

జగిత్యాల(D)లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు నీవు నాకు మద్దతిస్తే నేను నీకు సపోర్ట్ చేస్తానంటూ మాట్లాడుకుంటున్నారు. సర్పంచ్కు నాకు మద్దతిస్తే, వార్డులలో నీకు మద్దతిస్తానంటూ సర్పంచ్, వార్డ్ అభ్యర్థులు ఒప్పందం చేసుకుంటున్నారు. అలాగే వార్డులకు పోటీ చేసేవారు నేను పోటీ చేస్తున్న వార్డులో నన్ను సపోర్ట్ చేస్తే నీవు పోటీ చేస్తున్న వార్డులో నీకే మద్దతిస్తా అంటూ డీల్స్ చేసుకుంటున్నారు.
News December 2, 2025
పిల్లల్ని కనండి.. ఎలాన్ మస్క్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే మానవ జాతి క్షీణించి.. అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ <<18433631>>People by WTF<<>> పాడ్కాస్ట్లో మస్క్ కీలక విషయాలు పంచుకున్నారు. “నువ్వూ పిల్లలను కనాల్సిందే” అంటూ కామత్కు సూచించారు. మనిషి మనుగడ కోసం సంతానం కొనసాగించాలని స్పష్టం చేశారు.


