News March 2, 2025
LRS దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన LRS దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
Similar News
News March 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీ20 ఫార్మాట్లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.
News March 23, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ.. యువకుడి మృతి

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన రవీంద్ర (26) శుక్రవారం కుటుంబ సభ్యులతో భూతగాదాలతో గొడవ పడి పారాసెటమాల్ మాత్రలను వేసుకున్నాడు. అనంతరం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. శనివారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రవీంద్ర మరణించాడని, సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఇజాజొద్దీన్ తెలిపారు.