News March 22, 2025

LRS రాయితీకి మార్చ్ 31 వరకే అవకాశం

image

మార్చ్ 31 నాటికి LRS క్రమబద్ధీకరణ చేసుకుంటే రుసుంలో 25% మినహాయింపు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీసీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు LRS దరఖాస్తు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు జాకీర్, విక్రమసింహారెడ్డి, వెంకటయ్య, వేణుగోపాల్ తదితరులున్నారు.

Similar News

News November 9, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.

News November 9, 2025

జడ్చర్లలో నకిలీ రూ.500 నోట్ల కలకలం

image

నకిలీ రూ.500 నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని జడ్చర్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో దుకాణ యజమాని పట్టుకున్నాడు. శనివారం దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి ఇచ్చిన మూడు నకిలీ రూ.500 నోట్లను యజమాని గుర్తించి నిలదీశాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News November 9, 2025

పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

image

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.