News March 2, 2025

LRS దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన LRS దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

Similar News

News November 3, 2025

ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

image

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.

News November 3, 2025

₹లక్ష కోట్లతో రీసెర్చ్ ఫండ్.. ప్రారంభించిన మోదీ

image

టెక్ రెవల్యూషన్‌కు భారత్ సిద్ధంగా ఉందని PM మోదీ అన్నారు. ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో ESTIC-2025 కాంక్లేవ్‌ను ప్రారంభించారు. ₹లక్ష కోట్లతో రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ (RDI) స్కీమ్ ఫండ్‌ను లాంచ్ చేశారు. ‘ఈ ₹లక్ష కోట్లు మీకోసమే. మీ సామర్థ్యాలను పెంచేందుకు, కొత్త అవకాశాలు సృష్టించేందుకు ఉద్దేశించినవి. ప్రైవేటు సెక్టార్‌లోనూ రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.

News November 3, 2025

వరంగల్-ఖమ్మం రహదారిపై గ్రానైట్ లారీల బీభత్సం..!

image

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ బండల లారీలు తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల MHBD జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ డివైడర్‌ను ఢీకొట్టగా, ఫతేపురం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాజాగా నాంచారిమడూరు వద్ద లారీ అదుపుతప్పి ఏకంగా ఇంటి ప్రహరీని ఢీకొంది. అధిక బరువుతో లోడ్ అయిన లారీలే ఈ ప్రమాదాలకు కారణమని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.