News March 8, 2025
LRS సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మార్చి 31 చివరి నాటికి 25 శాతం రాయితీతో ఎల్.ఆర్.ఎస్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎల్. ఆర్.ఎస్ లేని వారు మార్చి 31 తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి రాయితీ లేకుండా ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ సదవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


