News May 20, 2024
LS PHASE 5: ‘అయోధ్య’ ఓటు ఎవరికి? – 2/2

బీజేపీ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచినా ఎస్పీకి ఓట్ షేర్ పెరగడం చర్చనీయాంశమైంది. బీజేపీకి 2014లో 48.08%, 2019లో 48.66% రాగా SPకి 2014లో 20.43%, 2019లో 42.64% నమోదైంది. అయోధ్యలో పర్యాటక రంగం వృద్ధిపై కొందరిలో సంతృప్తి ఉన్నా పేదలను పట్టించుకోలేదనే అసంతృప్తి గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి పోలింగ్లో ఓటర్లు మార్పు కోరుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.<<-se>>#Elections2024<<>>
Similar News
News November 11, 2025
CSKకి సంజూ శాంసన్ ఎందుకు?

సంజూ శాంసన్ CSKలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే జడేజాను RRకు పంపి శాంసన్ను తీసుకోవడంలో చెన్నై జట్టుకు భవిష్యత్ ప్రయోజనాలున్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ధోనీ తర్వాత సారథిగా సంజూ బెటర్ అని యాజమాన్యం భావించినట్లు పేర్కొంటున్నాయి. కీపింగ్, స్ట్రాంగ్ బ్యాటర్ కోటాను ఫుల్ఫిల్ చేస్తారనే ట్రేడ్కు చెన్నై ఆసక్తి చూపినట్లు వివరిస్తున్నాయి. గతంలో జడేజాకు CSK కెప్టెన్సీ ఇవ్వగా ఫెయిలైన విషయం తెలిసిందే.
News November 11, 2025
‘రిచా’ పేరిట స్టేడియం

WWC విన్నర్ రిచా ఘోష్కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.
News November 11, 2025
‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.


