News June 5, 2024
LS POLLS: ఓట్ షేర్ పర్సెంట్ ఎలా ఉందంటే..

ఈ లోక్సభ ఎన్నికల్లో NDA కూటమికి 46.2% ఓట్ షేర్ నమోదు కాగా ఇండియా కూటమి ఓట్ షేర్ 41.3%గా రికార్డ్ అయింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి (అప్పట్లో UPA) ఓట్ షేర్ 6.99% వృద్ధి చెందింది. మరోవైపు NDA కూటమికి గతంలో పోలిస్తే 0.2% ఓట్ షేర్ తగ్గింది. ఇక ఇతరులకు 2019తో పోలిస్తే 6.79% పోల్ శాతం తగ్గి 12.5%గా రికార్డ్ అయింది.
Similar News
News January 21, 2026
సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్, సబ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM),టెన్త్, 7వ తరగతి అర్హత కలిగినవారు అర్హులు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://centralbank.bank.in/
News January 21, 2026
శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.
News January 21, 2026
దావోస్లో సీఎం రేవంత్, చిరంజీవి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.


