News March 3, 2025

LXPT: ఉపాధ్యాయ విద్యకు దరఖాస్తులు ఆహ్వానం

image

లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్ఠాత్మకమైన ఉపాధ్యాయ విద్యార్థి కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు ప్రిన్సిపల్ మహాత్మ సంతోష్ తెలిపారు. నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ బిఎ. బిఎడ్‌లో ప్రవేశం కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 విద్యా సంవత్సరం కోసం అర్హత, ఆసక్తి ఉన్న వారు మార్చి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 10, 2025

IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iimranchi.ac.in

News December 10, 2025

ADB: ఇంకా కొద్ది గంటలే.. ఆలోచించుకో

image

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు.. అలాంటి పల్లెలు అభివృద్ధి చెందితినే దేశం ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనుంది. ఓటర్ అన్న నీ వజ్రాయుధాన్ని ఉపయోగించడానికి ఇంకా కొద్దిగా సమయం మిగిలింది. మన కులం.. మన వర్గం.. మన పార్టీ అని ఆలోచించుకోకుండా గ్రామానికి మంచి చేసే వాడిని ఎన్నుకో. దేనికైనా లొంగి చెడుకు ఓటేస్తే నిన్ను పట్టుకొని పీడిస్తాడు.

News December 10, 2025

NLG: అన్న పైసలు వేసిన.. రేపు వస్తున్నావా..!

image

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ గురువారం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో పట్టణాల్లో ఉన్న పల్లె ఓటర్లకు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తెగ ఫోన్లు చేస్తున్నారు. “అన్న ఎట్లున్నవే.. పైసలేసిన రేపు వచ్చి ఓటేయండి మీ ఓటే నా గెలుపును డిసైడ్ చేస్తుంది.. తప్పకుండా రావాలి” అని వేడుకుంటున్నారు. ఇదే అదనుగా ఓటర్లు తమ ట్రావెలింగ్, ఇతర ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.