News March 25, 2025

LXT: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని లక్షెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మ తెలిపారు. విద్యార్థులు త్వరగా చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. నాగర్‌కర్నూల్‌లో ఆందోళన  

image

ఊర్కొండపేటలో జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వర్ధం పర్వతాలు మాట్లాడుతూ..అక్కడ ఒక గ్యాంగ్ మాటు వేసుకుని ఉందంటే ఈ తతంగం ఇప్పటికిప్పుడు జరిగిందేమీ కాదని, కొంతమంది సహకారం లేకపోతే ఇలాంటి క్రూర, దుర్మార్గమైన ఘటనలు జరగవన్నారు.

News April 2, 2025

రాయపర్తి: ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించండి: ఎమ్మెల్యే

image

రాయపర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా నిరంతరం పనిచేస్తున్నామని, ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అందించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News April 2, 2025

నాగర్ కర్నూల్: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

image

ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా పోలీస్ షీటీమ్స్‌ను సంప్రదించి వేధింపుల నుంచి విముక్తి పొందాలని యువతులకు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణ కోసం పోలీస్, షీ టీం బృందాలు పర్యటిస్తూ బస్టాండ్లు, విద్యాసంస్థలు, గ్రామ స్టేజీల్లో నిఘా ఉంచుతామని, మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యమన్నారు.

error: Content is protected !!