News March 25, 2025

LXT: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని లక్షెట్టిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ మహాత్మ తెలిపారు. విద్యార్థులు త్వరగా చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News March 31, 2025

భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఆందోళన.. !

image

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు గ్రామీణ కార్యకర్తలకు చేరకుండా, అర్హత కలిగిన నిరుద్యోగులకు అధికారుల ద్వారా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగ యువతకు అందించే గొప్ప అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.

News March 31, 2025

శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

image

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

News March 31, 2025

నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

image

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై ఇటీవ‌ల పలు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. కాకాణికి నోటీసులు అంద‌చేసేందుకు పొద‌ల‌కూరు పోలీసులు ఆదివారం ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెల‌కొంది.

error: Content is protected !!