News July 18, 2024
యూట్యూబర్లపై పోలీసులకు ‘మా’ ఫిర్యాదు

TG: నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మూవీ ఆర్టిస్ట్స్(మా) అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా’ ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు. ప్రణీత్ హనుమంతు ఘటన తర్వాత యూట్యూబర్లకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రోలింగ్ వీడియోలన్నింటినీ తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అప్పట్లో తేల్చిచెప్పారు.
Similar News
News November 14, 2025
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

AP: భవిష్యత్ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
News November 14, 2025
కాంగ్రెస్కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.
News November 14, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.


