News July 18, 2024

యూట్యూబర్లపై పోలీసులకు ‘మా’ ఫిర్యాదు

image

TG: నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మూవీ ఆర్టిస్ట్స్(మా) అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా’ ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు. ప్రణీత్ హనుమంతు ఘటన తర్వాత యూట్యూబర్లకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రోలింగ్ వీడియోలన్నింటినీ తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అప్పట్లో తేల్చిచెప్పారు.

Similar News

News January 9, 2026

TET ఫలితాలు విడుదల

image

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్లో<<>> ఫలితాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 10న మొదలైన ఈ ఆన్‌లైన్ పరీక్షలు 21వ తేదీ వరకు కొనసాగాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. సమాధానాలకు సంబంధించి అభ్యంతరాలు కూడా స్వీకరించారు.

News January 9, 2026

ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

News January 9, 2026

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

image

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.