News July 18, 2024

యూట్యూబర్లపై పోలీసులకు ‘మా’ ఫిర్యాదు

image

TG: నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్లపై మూవీ ఆర్టిస్ట్స్(మా) అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘మా’ ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ డీజీపీని కలిసి తమ ఫిర్యాదును అందజేశారు. ప్రణీత్ హనుమంతు ఘటన తర్వాత యూట్యూబర్లకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రోలింగ్ వీడియోలన్నింటినీ తొలగించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అప్పట్లో తేల్చిచెప్పారు.

Similar News

News November 23, 2025

ఈనెల 23న సత్య సాయి శతజయంతి ఉత్సవాలు: కలెక్టర్

image

రాష్ట్ర పండుగగా పుట్టపర్తి సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకను అధికారికంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, కలెక్టరేట్ వద్ద సత్య సాయిబాబా జన్మదిన వేడుకలు నిర్వహించాలన్నారు.

News November 23, 2025

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం

image

సింగరేణి సీఎండీ బలరామ్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి త్వరలో వాట్సాప్ నెంబరును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికి, ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎండీ వెల్లడించారు.

News November 23, 2025

ANU: పీజీ విద్యార్థులకు అలర్ట్..!

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (దూరవిద్య) పరిధిలో జూలై, ఆగస్టు 2025లో జరిగిన MSC మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ ఒకటో సెమిస్టర్ పరీక్షల రీ-వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ-వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మరిన్ని వివరాలకై https://anucde.info/ResultsJAug25.aspలో చెక్ చేయాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.