News June 4, 2024
మాచర్ల: పిన్నెల్లి కోటను బద్దలుకొట్టిన బ్రహ్మానందరెడ్డి

AP: ఎన్నికల పోలింగ్ సమయంలో అల్లర్లతో దేశవ్యాప్తంగా సంచలనమైన పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ గెలుపొందింది. అక్కడ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 32,324 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 25 ఏళ్లుగా మాచర్లను ఏలుతున్న పిన్నెల్లి కోటను జూలకంటి బద్దలుకొట్టినట్లయింది.
Similar News
News November 19, 2025
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.
News November 19, 2025
9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
News November 19, 2025
టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్సైట్లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


