News July 31, 2024

పిచ్చి తల్లీ.. ఎంత కష్టమొచ్చిందమ్మా!

image

TG: బిడ్డకు జలుబు వచ్చినా తల్లడిల్లిపోయేదా తల్లి. అదే అమ్మ నేడు మంచాన పడితే నడిరోడ్డుపై వదిలేశాడా కొడుకు. మేడ్చల్‌కు చెందిన అరవింద్ తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తానంటే పాపం అమాయకంగా వెంట వచ్చిన ఆ పిచ్చితల్లిని ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బిడ్డ వదిలేశాడని ఇంకా నమ్మని ఆ అమ్మ, కొడుకును చూడాలని తపిస్తుండటం కంటతడి పెట్టిస్తోంది.

Similar News

News February 2, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్

image

WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.

News February 2, 2025

సండే క్రికెట్ ఫీవర్.. నేడు రెండు మ్యాచ్‌లు

image

IND క్రికెట్ అభిమానులకు సండే బొనాంజా. ఇవాళ 2 మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. U-19 ఉమెన్స్ WCలో అజేయంగా అదరగొట్టిన భారత్ నేడు ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. మ.12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మెన్స్ క్రికెట్‌లో ENGపై ఇప్పటికే T20 సిరీస్ కైవసం చేసుకున్న సూర్య సేన నేడు చివరి టీ20లో తలపడనుంది. రా.7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండింటినీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News February 2, 2025

NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.