News July 28, 2024
మదనపల్లె కేసు: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. YSRCP మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాషా ఇంట్లో నోటీసులు అందజేసి, ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్ని, పలువురు వైసీపీ లీడర్లను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

భిక్కనూర్లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.
News November 20, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 20, 2025
APPLY NOW: NRDCలో ఉద్యోగాలు..

న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<


