News April 4, 2024
టీడీపీలో చేరిన మాదిగాని గురునాథం

AP: 3 రాజధానులు కావాలంటూ 4 ఏళ్లుగా అమరావతిలో దీక్షలు చేసిన బహుజన పరిరక్షణ సమితిని TDPలో విలీనం చేస్తున్నట్లు అధ్యక్షుడు మాదిగాని గురునాథం తెలిపారు. నిన్న TDPలో చేరిన ఆయన.. ‘పరిపాలన వికేంద్రీకరణతో లాభం జరుగుతుందని నమ్మి నాలుగేళ్లు ఉద్యమం చేసి చివరకు మోసపోయాం. వికేంద్రీకరణ అస్తవ్యస్తంగా మారింది. దానిపై ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయాం. TDP కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తాం’ అని గురునాథం వెల్లడించారు.
Similar News
News January 17, 2026
ఇండిగో సంక్షోభం.. భారీ జరిమానా విధించిన DGCA

వందల <<18481260>>విమానాల రద్దు<<>>, వాయిదాలతో ప్రయాణికులను ఇండిగో ముప్పుతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్లో కొన్ని రోజులపాటు కొనసాగిన ఈ సంక్షోభంపై DGCA ఇవాళ చర్యలు తీసుకుంది. ఇండిగోకు రూ.22.2 కోట్ల జరిమానా విధించింది. అలాగే రూ.50 కోట్ల బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని ఆదేశించింది. రాబోయే నెలల్లో తనిఖీలు చేసి దశలవారీగా ఆ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇంప్రూవ్మెంట్ చూపించాలని స్పష్టం చేసింది.
News January 17, 2026
రేగిపండ్లతో లాభాలెన్నో..

*విటమిన్ ‘సి’ వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
*అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది
*గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా తినొచ్చు (మితంగా)
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి
*క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
News January 17, 2026
₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.


