News October 16, 2024
‘మేడిన్ ఇండియా’ బుల్లెట్ ట్రైన్ నిర్మించేది ఇక్కడే

‘మేడిన్ ఇండియా’ తొలి బుల్లెట్ ట్రైన్లను రూపొందించే అవకాశం బెంగళూరులోని BEMLకు దక్కింది. డిజైనింగ్, తయారీ, 2 హైస్పీడ్ ట్రైన్ సెట్స్ కోసం కంపెనీకి ICF రూ.867 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కోచ్ ధర రూ.27.86 కోట్లు. ‘భారత హైస్పీడ్ రైల్ జర్నీలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయి. 280 KMPH స్పీడ్తో ట్రైన్ సెట్లను దేశీయంగా డిజైన్ చేయబోతున్నాం’ అని BEML తెలిపింది. 2026 ఆఖర్లో వీటిని డెలివరీ చేస్తుందని సమాచారం.
Similar News
News January 20, 2026
స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 20, 2026
‘అబూ సలేం పారిపోతాడు’.. పెరోల్పై ప్రభుత్వం అభ్యంతరం

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేం పెరోల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సోదరుడి మరణం నేపథ్యంలో పెరోల్ కోసం అప్లై చేయగా, 14 రోజులు ఇస్తే అబూ సలేం పారిపోయే ప్రమాదం ఉందని MH ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అత్యవసరమైతే 2 రోజులు మాత్రమే పెరోల్ ఇవ్వొచ్చని సూచించింది. కాగా గతంలో సలేం పోర్చుగల్కు పారిపోగా అక్కడి నుంచి భారత్కు తీసుకొచ్చారు.
News January 20, 2026
టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్ను MAR 16-APR 1 వరకు నిర్వహిస్తామని SSC బోర్డు 2025 NOVలో వెల్లడించింది. MAR 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో GOVT సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను MAR 21న జరిపే ఛాన్స్ ఉంది. కాగా కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘Way2News’కి తెలిపారు.


