News September 22, 2024
ప్యూరిఫైడ్ వాటర్తో మెగ్నీషియం లోపం?
మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్లో అన్ని మినరల్స్ను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.
Similar News
News September 22, 2024
అల్ప పీడనం.. భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు పలకరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో APలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News September 22, 2024
24వ తేదీ వరకు ఫ్రీ ఎగ్జిట్కు అవకాశం
AP: కన్వీనర్ కోటా కింద తొలి విడతలో MBBS సీటు పొందిన విద్యార్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా సీటు వదులుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్కు లేఖ అందించాలంది. ఇటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు 24వ తేదీలోగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
News September 22, 2024
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: మాజీ ఎంపీ
AP: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.