News February 26, 2025

మహా శివరాత్రి: ఉపవాసం ఎవరు ఉండొద్దంటే?

image

పరమశివుడికి ఇష్టమైన మహా శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. అయితే ఇవాళ అనారోగ్యం, నీరసంతో ఉన్నవారు, డయోబెటిస్ వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలు చేయకపోవడమే ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వారు మహాశివరాత్రి రోజున శివనామ స్మరణ, ప్రవచనాలు వింటూ ఉండొచ్చని సూచిస్తున్నారు.

Similar News

News December 28, 2025

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్‌లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.

News December 28, 2025

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడు?

image

అయ్యప్ప స్వామి భక్తులు ఎంతగానో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి 2026లో జనవరి 14న కనిపించనుంది. ఆ రోజు సాయంత్రం 6:30 నుంచి 6:55 గంటల మధ్య పొన్నాంబలమేడు వద్ద దర్శనమిస్తుందని అంచనా. జ్యోతి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దేవస్వం బోర్డు సూచించింది. జనవరి 19 రాత్రి వరకు దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.

News December 28, 2025

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా సురేశ్ బాబు

image

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో <<18695841>>ఫిల్మ్ ఛాంబర్ <<>>ప్రెసిడెంట్‌గా డి.సురేశ్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా దామోదరప్రసాద్‌ను ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది కార్యవర్గంలో 31 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు, 17 మంది మన ప్యానెల్‌ మెంబర్స్ విజయం సాధించారు. 2027 వరకు సురేశ్ బాబు ప్రెసిడెంట్‌గా ఉండనున్నారు.