News September 17, 2024
క్రేన్ వద్దకు చేరుకున్న మహాగణపతి

ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసిన క్రేన్-4 వద్దకు చేరుకున్నాడు. అశేష జనవాహిని తోడు రాగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో వినాయకుడి విగ్రహాన్ని భారీ క్రేన్తో హుస్సేన్సాగర్ నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.
Similar News
News January 31, 2026
మత మార్పిడి ఆరోపణ నిరూపిస్తే రాజీనామా: కౌశిక్ రెడ్డి

TG: కరీంనగర్ CP మతమార్పిడి చేస్తున్నట్లు తాననలేదని BRS MLA కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ‘TG IPS ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను అలా అన్నట్లు నిరూపిస్తే MLAగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో వారిపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


