News February 15, 2025

మహాకుంభమేళా.. 20,000 మంది ఆచూకీ లభ్యం

image

కోట్లాది మంది భక్తులతో కళకళలాడుతున్న మహాకుంభమేళాలో కుటుంబాల నుంచి మిస్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే AI బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా 20K మందిని వారి ఫ్యామిలీల వద్దకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య రోజున అత్యధికంగా 8,725 మందిని కనిపెట్టినట్లు చెప్పారు. విడిపోయిన భక్తులను కాపాడటంలో UNICEF, NGOలు, వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Similar News

News September 17, 2025

ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా

image

టోక్యోలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్ చేరారు. ఆటోమేటిక్ ఫైనల్ మార్క్ 84.50 మీ. కాగా ఆయన తొలి అటెంప్ట్‌లోనే జావెలిన్‌ను 84.85 మీ. విసిరారు. వెబెర్(జర్మనీ) 87.21 మీ., వెంగెర్(పోలెండ్) 85.67 మీ. విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఫైనల్ రేపు జరగనుంది. ఇక 2023లో బుడాపేస్ట్‌లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ కొల్లగొట్టారు.

News September 17, 2025

ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

image

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.

News September 17, 2025

కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

image

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.