News January 29, 2025
MAHAKUMBH MELA: రూ.25లక్షల చొప్పున పరిహారం

ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు యూపీ సర్కార్ నష్ట పరిహారం ప్రకటించింది. 30 కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు రాగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనలో 30 మంది చనిపోగా, 60 మందికి గాయాలైన విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
జగిత్యాల జిల్లాకు జీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు అధికారులను నియమించింది. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడినిగా పి. వెంకట్ రెడ్డిని, వ్యయ పరిశీలకుడినిగా ఎం. మనోహర్ను నియమిస్తూ తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News November 20, 2025
పిల్లల్లో బీపీ ఉంటే ఎన్నో దుష్ప్రభావాలు

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు గుండె కండరం మందం అయి గుండె వైఫల్యానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. కిడ్నీలో రక్తనాళాలు దెబ్బతిని, వడపోత ప్రక్రియ అస్తవ్యస్తమవ్వచ్చు. కంట్లోని రెటీనా దెబ్బతినడం, మెదడుకు రక్త సరఫరా చేసే నాళాలు దెబ్బతిని తలనొప్పి, తలతిప్పు తలెత్తచ్చంటున్నారు. అంతేకాకుండా, రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ ముంచుకురావొచ్చని వివరిస్తున్నారు.
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.


