News November 30, 2024
చైనాలో ‘మహారాజ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ₹15 కోట్లు!

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా నిన్న చైనాలో రిలీజైంది. ఆ దేశవ్యాప్తంగా మొత్తం 40,000+ స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వస్తోందని సినీవర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ మూవీ రూ.15 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో రూ.100కోట్ల మార్క్ దాటిన విషయం తెలిసిందే.
Similar News
News April 10, 2026
మే 1 నుంచి థియేటర్లు బంద్?

తెలంగాణ(నైజాం)లో మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేసే యోచనలో ఎగ్జిబిటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పర్సెంటేజీ విధానాన్ని నిర్మాతలు తిరస్కరించడంతో ఇలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆదాయాన్ని అలా పంపిణీ చేస్తేనే మూవీస్ ప్రదర్శిస్తామని, ఈనెల 30 లోగా నిర్ణయం తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసిందని టాక్. రెంటల్ స్థానంలో <<19548702>>పర్సెంటేజీ విధానం<<>> అమలు చేయాలని 23 థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల నిర్ణయించాయి.
News April 10, 2026
కాక్టెయిల్-2 షూటింగ్.. బీచ్లో రష్మిక చిల్

కృతి సనన్తో కలిసి బీచ్లో చిల్ అవుతున్న ఫొటోను రష్మిక మందన్నా ఇన్స్టాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘కాక్టెయిల్-2’ షూటింగ్ గ్యాప్లో తీసుకున్న ఫొటో ఇది. ఇందులో రష్మిక ఆరెంజ్ కో-ఆర్డ్ సెట్లో మెరిసిపోతుండగా, కృతి ఫ్లోరల్ డ్రెస్లో కనిపించారు. సాంగ్ షూటింగ్ సమయంలో ఈ పిక్ తీసినట్లు తెలుస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ సీక్వెల్లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
News April 10, 2026
మచ్చలున్న మామిడి పండ్లు తింటున్నారా?

మార్కెట్లో కనిపించే కొన్ని మామిడి పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. తోటలో ఎక్కువ తేమ కారణంగా మామిడి కాయలు చెట్టుపై ఉన్నప్పుడే ఫంగస్, బాక్టీరియా వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. దీంతో పండ్లు దెబ్బతింటాయి. ఇవి తింటే అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని కొనకపోవడం బెటర్. ఇక మామిడి రైతులు నల్ల మచ్చలు వచ్చిన కాపునకు నీళ్లు ఎక్కువ పెట్టొద్దు.


