News October 26, 2024
మహారాష్ట్ర ఎలక్షన్స్: ఫేవరేటిజమ్పై రాహుల్ గాంధీ అప్సెట్!
మహారాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై LOP రాహుల్ గాంధీ పెదవి విరిచారని తెలుస్తోంది. ఫేవరేటిజం కనిపిస్తోందని అసంతృప్తి చెందినట్టు సమాచారం. పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగులో ఆయన దీనిని హైలైట్ చేశారని ఇండియా టుడే తెలిపింది. కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని సీట్లను శివసేన UBTకి ఎందుకు కేటాయించారని ప్రశ్నించినట్టు పేర్కొంది. పోటీ చేస్తున్న 85 సీట్లకు PCC 48 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 26, 2024
క్రెడిట్ కార్డులపై బ్యాంకుల దీపావళి ఆఫర్స్
కస్టమర్లకు బ్యాంకులు గుడ్న్యూస్ చెప్పాయి. దీపావళి, ధంతేరాస్ షాపింగ్ చేసేందుకు క్రెడిట్ కార్డుపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, గోల్డ్ జువెలరీ, మొబైళ్లు, దుస్తుల కొనుగోలుపై ICICI, HDFC, AXIS BANKS, SBI కార్డ్స్ డీల్స్ ప్రకటించాయి. జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ, యాపిల్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మింత్రా, తనిష్క్తో టైఅప్స్ పెట్టుకున్నాయి.
News October 26, 2024
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
AP: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శింగనమల మం. నాయనపల్లి క్రాస్ వద్ద కారు టైర్ పగలడంతో అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
News October 26, 2024
కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఉన్నారా?: షర్మిల
AP: ఆస్తి విషయంలో వైసీపీ చీఫ్ జగన్ తమపై కేసు పెట్టడం చూసి చాలా బాధేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ‘ప్రతి ఇంట్లో ఇలాంటివి సహజమని అంత సులభంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ లేవా?’ అని జగన్ను నిలదీశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని షర్మిల దుయ్యబట్టారు.