News February 22, 2025

కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

image

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.

Similar News

News February 23, 2025

టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్‌లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.

News February 23, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. కోహ్లీ ఆడేనా?

image

పాకిస్థాన్‌తో మ్యాచ్‌‌లో భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడటం అనుమానాస్పదంగా మారిందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో కాలికి గాయం కావడంతో, ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కనిపించినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు SMలోనూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోహ్లీ గాయంపై BCCI ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని అంతా భావిస్తున్నారు. మ్యాచ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News February 23, 2025

‘శివరాత్రి’ రోజంతా ఉచిత క్యూలైన్లు

image

AP: శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులకు సూచించారు. ఆ రోజంతా ప్రముఖ శివాలయాల్లో ఉచిత క్యూలైన్లు కొనసాగించాలని ఆదేశించారు. అంతరాలయ దర్శనాలకు అనుమతించకపోతే వేగంగా క్యూలైన్లు ముందుకు కదులుతాయన్నారు. కాగా శ్రీశైలం, శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

error: Content is protected !!