News November 16, 2024

మహారాష్ట్ర: ఆ 87 సీట్ల‌లో Total Confusion

image

MH ఎన్నిక‌ల్లో 87 చోట్ల ఏది అస‌లైన పార్టీయో తెలియ‌క ప్రజలు గందర‌గోళంలో ఉన్నారు. NCP, శివ‌సేన చీలిపోవ‌డంతో కొత్త‌గా NCP SP, శివ‌సేన UBT ఏర్పడ్డాయి. ఇప్పుడీ 4 పార్టీలు 2 కూట‌ముల్లో ఉన్నాయి. అలా 51 సీట్ల‌లో శివ‌సేన షిండే వ‌ర్గం-శివ‌సేన ఉద్ధ‌వ్ వ‌ర్గం పోటీప‌డుతున్నాయి. 36 చోట్ల NCP అజిత్ వ‌ర్గం-NCP శ‌ర‌ద్ ప‌వార్ వ‌ర్గాలు బ‌రిలో ఉన్నాయి. ఈ 87 చోట్ల ఎవరిది ఏ పార్టీయో తెలియక ప్రజలు తిక‌మ‌క‌ప‌డుతున్నారు.

Similar News

News January 5, 2026

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సబ్సిడీ ధరతో గోధుమ పిండిని అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆమె ఈ పంపిణీని ప్రారంభించారు. ఇక నుంచి అన్ని రేషన్ షాపుల్లో ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జేసీ సూచించారు.

News January 5, 2026

USలో తెలుగు యువతి హత్య.. ఇండియాలో నిందితుడి అరెస్ట్?

image

USలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల(27) హత్యకు గురైన కేసులో నిందితుడు అర్జున్ శర్మ అరెస్ట్ అయినట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఆ కథనాల ప్రకారం.. ఇంటర్‌పోల్ సాయంతో అతణ్ని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్జున్ అదే రోజు తెలివిగా ఇండియాకు పారిపోయివచ్చాడు.

News January 5, 2026

సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

image

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.