News August 22, 2025
రూ.300 కోట్ల దిశగా ‘మహావతార్ నరసింహ’

హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 5వ వారంలోనూ థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.278 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ గత నెల 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచింది.
Similar News
News August 22, 2025
ఎవరా లీకువీరుడు..?

TG సెక్రటేరియట్లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
News August 22, 2025
నటుడికి భార్య విడాకులు?

నటుడు గోవింద-సునీత ఆహుజా దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు మరోసారి కోడై కూస్తున్నాయి. భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో సునీత విడాకులకు అప్లై చేసినట్లు తెలిపాయి. భర్త తనను వేధిస్తున్నాడని, మోసం చేశాడని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లు వెల్లడించాయి. కాగా గతంలోనూ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరగగా సునీత <<15621494>>ఖండించారు<<>>. ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
News August 22, 2025
PHOTO: కాబోయే కోడలితో సచిన్ ఫ్యామిలీ?

సచిన్ కొడుకు అర్జున్కు సానియా చందోక్తో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సచిన్ దీనిపై స్పందించలేదు. ఇవాళ ముంబైలో సారా తెందూల్కర్ ఫిట్నెస్ సెంటర్ ఓపెనింగ్కు సానియా హాజరయ్యారు. తెందూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఆమె సెంటర్ను ప్రారంభించడం ఎంగేజ్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తోంది. తర్వాత వారంతా కలిసి ఫొటోలు దిగారు. వీటిని స్వయంగా సచినే Xలో షేర్ చేశారు.