News November 23, 2024
బ్యాలెట్ ఓట్లలో మహాయుతిదే పైచేయి

మహారాష్ట్రలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో అధికార మహాయుతి పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆ కూటమి 76కు పైగా స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇక ఈవీఎంలు ఇప్పుడే తెరిచారు. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కనీసం 20-25 నిమిషాల సమయం పట్టనుంది. బారామతిలో ఇప్పటివరకు వెనుకంజలో ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మళ్లీ లీడింగ్లోకి వచ్చారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్లో ఫడణవీస్ ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News February 7, 2026
IND-US మధ్య కుదిరిన ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్

IND-US మధ్య ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఖరారైనట్టు వైట్హౌస్ ప్రకటించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను 18%కి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేసేందుకు భారత్ అంగీకరించిందని ఫ్రేమ్ వర్క్లో పేర్కొంది. US నుంచి ఇంధనం, గ్యాస్ను భారత్ దిగుమతి చేసుకోనున్నట్టు చెప్పింది. అమెరికా దిగుమతి చేసుకునే వాటిపై సుంకాలను IND సున్నాశాతానికి తగ్గిస్తుందని తెలిపింది.
News February 7, 2026
బీట్రూట్తో బ్యూటీ

బీట్రూట్ను డైట్లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తగ్గుతాయి. * బీట్రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేసుకుంటే రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుపు, మృదుత్వం పెరుగుతుంది.
News February 7, 2026
రేపు భాను సప్తమి.. ఏం చేయాలంటే?

ఆదివారం సప్తమి తిథితో వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఈ పండగ రోజు చేసే కొన్ని పనులు మనకు మంచి చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దానధర్మాలు చేస్తే మంచిది. వీటివల్ల దరిద్రం తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


