News January 2, 2025

మరోసారి థియేటర్లలోకి మహేశ్ బాబు ‘అతిథి’

image

మరో రెండుమూడేళ్ల వరకూ మహేశ్ బాబు కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన పాత సినిమాల్ని నిర్మాతలు రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, మురారి తదితర సినిమాలు విడుదల కాగా.. వచ్చే నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘అతిథి’ రీ-రిలీజ్ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. మరి రీ-రిలీజ్‌లో ఎలా అలరిస్తుందో చూడాలి.

Similar News

News December 1, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.

News December 1, 2025

25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://ssc.gov.in

News December 1, 2025

ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

image

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.