News October 18, 2024

రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

image

సూపర్‌స్టార్ మహేశ్‌తో రాజమౌళి తెరకెక్కించే సినిమా 2 భాగాలుగా రానుందా? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. కథ విస్తృతమైనది కావడంతో ఒక భాగంలో మొత్తం చెప్పడం సాధ్యం కాదని, 2 భాగాలుగా తీయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి లభించే ఆదరణ బట్టి మున్ముందు మరిన్ని సీక్వెల్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటున్నాయి. మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News February 3, 2026

జల్‌జీవన్ మిషన్‌ నిధులు నిలిపివేత

image

జల్‌జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్‌లో ₹2.08 ల‌క్ష‌ల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.

News February 3, 2026

13న ఓటీటీలోకి రవితేజ సినిమా?

image

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్&కామెడీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

News February 3, 2026

U19 WC.. ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత ENG 277/7 స్కోర్ చేయగా ఆసీస్ 47.3 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటైంది. రేపు రెండో సెమీస్‌లో ఇండియా, అఫ్గాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.