News October 18, 2024
రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?

సూపర్స్టార్ మహేశ్తో రాజమౌళి తెరకెక్కించే సినిమా 2 భాగాలుగా రానుందా? నెట్టింట ఇదే చర్చ నడుస్తోంది. కథ విస్తృతమైనది కావడంతో ఒక భాగంలో మొత్తం చెప్పడం సాధ్యం కాదని, 2 భాగాలుగా తీయాలని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీటికి లభించే ఆదరణ బట్టి మున్ముందు మరిన్ని సీక్వెల్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటున్నాయి. మూవీ టీమ్ నుంచి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 7, 2026
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్

AP: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25% సీట్లు ఫ్రీగా కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనవారు https://cse.ap.gov.in/లో FEB 20 నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు, SC, ST, BCలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
News February 7, 2026
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ‘ఉపాధి హామీ’.. తగ్గిన పెట్టుబడి, పెరిగిన ఆదాయం

సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు APలోని అనకాపల్లి జిల్లాలో పలువురు రైతులు. ఈ పంటకు ఉపాధి హామీ పథకం కింద నిధుల సాయంతో వీరి పెట్టుబడి ఖర్చు చాలా వరకు తగ్గుతోంది. నిపుణుల సూచనతో పంట నాటి తొలి ఏడాది నుంచే రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఉపాధి హామీ కింద ఈ పంటకు ఎంత సాయం వస్తుంది? ఇతర కీలక సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 7, 2026
IMPS ట్రాన్సాక్షన్లపై SBI ఛార్జీలు

IMPS ట్రాన్సాక్షన్లపై సర్వీస్ ఛార్జీల వసూలుకు SBI సిద్ధమైంది. రూ.25వేల-రూ.లక్ష వరకు రూ.2+GST, రూ.లక్ష-2లక్షల వరకు రూ.6+GST, రూ.2లక్షల-5లక్షల వరకు రూ.6+GST వసూలు చేయనుంది. అయితే రూ.25వేల కంటే తక్కువ నగదు బదిలీకి ఎటువంటి ఛార్జీ చెల్లించనవసరం లేదు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వర్తిస్తాయి. FEB 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.


