News September 11, 2024
జనవరి నుంచే మహేశ్-రాజమౌళి మూవీ షూటింగ్?

సూపర్ స్టార్ మహేశ్బాబు ఈ ఏడాది ఏ సినిమాలోనూ నటించలేదు. సంక్రాంతికి రిలీజైన ‘గుంటూరు కారం’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో రాజమౌళి రూపొందించే SSMB29 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మొత్తం ప్రీప్రొడక్షన్ పనులే పూర్తిచేయనుండగా 2025 జనవరిలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కావడంతో భారీ ప్రీవిజువలైజేషన్, వర్క్షాప్స్పై జక్కన్న దృష్టిసారించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


