News November 11, 2024

సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

image

NCP మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో అదుపులోకి తీసుకున్నారు. Oct 12న సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి ఆఫీస్‌లో ఉన్నప్పుడు కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపగా మరణించారు. ఈ కేసులో దాదాపు 20 మంది అరెస్టయ్యారు.

Similar News

News February 18, 2026

రోజూ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నారా?

image

హ్యాండ్ బ్యాగ్ కొందరికి అవసరం. కానీ దాంట్లో అనవసరమైన వస్తువులు పెట్టి దాన్ని బరువుగా మారుస్తున్నారు చాలామంది. దాన్ని స్టైల్​గా చేత్తో పట్టుకోవడమో, భుజానికి వేసుకోవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో కండరాలు, ఎముకలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పోశ్చర్ మారిపోతుంది. కాబట్టి బ్యాగును చేతులు మారుస్తూ పట్టుకోవడం, లగేజ్ ఎక్కువగా ఉంటే బ్యాక్ ప్యాక్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.

News February 18, 2026

YouTube డౌన్

image

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 18, 2026

మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

image

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్‌, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.