News July 18, 2024
వయనాడ్లో 7లక్షల ఓట్ల మెజారిటీయే లక్ష్యం: ఏఐసీసీ

కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31లక్షలు, 2024లో 3.64లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది.
Similar News
News November 27, 2025
RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్నగర్(47), శంషాబాద్ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది
News November 27, 2025
ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

వాషింగ్టన్లోని వైట్హౌస్ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్మెన్లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్హౌస్ను లాక్డౌన్ చేసిన విషయం తెలిసిందే.
News November 27, 2025
చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.


