News July 18, 2024
వయనాడ్లో 7లక్షల ఓట్ల మెజారిటీయే లక్ష్యం: ఏఐసీసీ

కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31లక్షలు, 2024లో 3.64లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది.
Similar News
News December 11, 2025
టాప్ స్టోరీస్

* ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: CM CBN
* ఉస్మానియాలో పర్యటించిన CM రేవంత్.. అభివృద్ధి పనులకు రూ.1000Cr మంజూరు
* తెలంగాణలో రేపే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
* ఓట్ చోరీపై LSలో అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం
* ఇండిగో సంక్షోభం వేళ విమాన టికెట్ రేట్లను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఢిల్లీ HC ఆగ్రహం
News December 11, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలా? మీరేమంటారు?

తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సీబీఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చామని విద్యాశాఖ చెబుతోంది. అయితే దీన్ని టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్నిరోజుల గ్యాప్ వల్ల స్టూడెంట్స్ మరింత ఒత్తిడికి గురవుతారని, షెడ్యూల్లో లాజిక్ లేదని అంటోంది. విద్యార్థుల పేరెంట్స్గా మీ అభిప్రాయం ఏంటి?
News December 11, 2025
ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్ను 011-24604283/011-24632987 నంబర్లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.


