News July 18, 2024

వయనాడ్‌లో 7లక్షల ఓట్ల మెజారిటీయే లక్ష్యం: ఏఐసీసీ

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీకి 7లక్షల ఓట్ల మెజారిటీ తీసుకురావాలని AICC లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై స్థానిక నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. రాహుల్ గాంధీకి ఇక్కడ 2019లో 4.31లక్షలు, 2024లో 3.64లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయన ఈ స్థానాన్ని వదులుకోవడంతో బై ఎలక్షన్ రానుంది.

Similar News

News December 15, 2025

లంగ్స్‌కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

image

‘గోట్ టూర్‌’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్‌కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.

News December 15, 2025

మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

image

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్‌లో గ్రీట్ అండ్ మీట్‌లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.

News December 15, 2025

భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

image

<>ఉడిపి <<>>కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 3 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(మెకానికల్/నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ Eng) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. మేనేజర్‌కు నెలకు రూ.1,18,400, డిప్యూటీ మేనేజర్‌కు రూ.98,400 చెల్లిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.