News March 28, 2025
మేకిన్ ఇండియా.. భారీ డీల్

మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్రం భారీ రక్షణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. 156 ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్లను (LCH) HAL నుంచి కొనుగోలు చేసేందుకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఓకే చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.09 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులపై రక్షణ శాఖ సంతకాలు చేసింది. రూ.62 వేల కోట్లతో ఈ హెలికాప్టర్లను కర్ణాటకలోని బెంగళూరు, తుమ్కూర్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేయనుంది.
Similar News
News March 31, 2025
10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

గత 10 నెలల్లో ఏపీకి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన హోటల్, ఆఫీస్ టవర్కు తల్లి భువనేశ్వరితో కలిసి భూమిపూజ చేశారు. గత పాలకులు విధ్వంసక విధానాలతో వ్యాపార వాతావరణానికి నష్టం కలిగించారని లోకేశ్ విమర్శించారు. తాము విశాఖను ఐటీ హబ్గా మార్చి రాబోయే ఐదేళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News March 31, 2025
భూకంపం.. మసీదులు కూలి 700 మంది మృతి

గత శుక్రవారం మయన్మార్లో వచ్చిన భూకంపానికి మసీదులు కూలి ప్రార్థనలు చేస్తున్న 700 మందికి పైగా మరణించారని ఓ ముస్లిం సంఘ ప్రతినిధులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపానికి సుమారు 60 మసీదులు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పాత మసీదు భవనాలపై ఎక్కువ ప్రభావం పడిందని వివరించారు. కాగా, ఆ దేశంలో మొత్తం భూకంపం మృతుల సంఖ్య 1700 దాటింది.
News March 31, 2025
తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నారు: రోజా

AP: కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. ప్రస్తుతం రోజుకు దాదాపు 10వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారు. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు. ఇదేనా పవన్, BJPల సనాతన ధర్మం?, ఇదేనా చంద్రబాబు నమూనా ప్రక్షాళన?’ అని ప్రశ్నించారు.