News August 28, 2024
రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ విజృంభణ

AP: రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. అల్లూరి జిల్లాలో మలేరియా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. విశాఖ, తిరుపతి, కర్నూలులో డెంగ్యూ కేసులు, ఏలూరు, తిరుపతి, చిత్తూరులో చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 4,610 మలేరియా, 2,955 డెంగ్యూ, 99 గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా మరిన్ని కేసులు ఉంటాయని అంచనా.
Similar News
News December 19, 2025
మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మగవారితో పోలిస్తే ఆడవారిలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువ. అయితే దీని వెనుక కారణాన్ని గుర్తించారు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు. అల్జీమర్స్ పేషెంట్స్ రక్తంలోని లిపిడ్స్ను విశ్లేషించగా.. అల్జీమర్స్ ఉన్న మహిళల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న లిపిడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి మహిళలు ఒమేగా 3 కొవ్వులు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలని లేదా సప్లిమెంట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 19, 2025
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఫుట్బాల్ స్టార్!

స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ ‘Fast X: Part 2’లో ఆయన కనిపించనున్నారు. రొనాల్డోకు స్వాగతం పలుకుతూ నటుడు టైరెస్ గిబ్సన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
News December 19, 2025
జిల్లాకు 200 పెన్షన్లు.. శుభవార్త చెప్పిన సీఎం

AP: కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ IAS కలెక్టర్ల సదస్సులో చెప్పగా CM వెంటనే స్పందించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు జిల్లాకు 200 చొప్పున పెన్షన్ల మంజూరుకు అనుమతి ఇచ్చారు. ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.


