News October 3, 2025

అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

image

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.

Similar News

News October 3, 2025

మేక, గుర్రం గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

మేకలు, గొర్రెలను వేటాడటం ఇతర జంతువులకు అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటి కనుపాపలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి 340 డిగ్రీల(మనిషికి 180 డిగ్రీలు) విశాల దృష్టితో చూడగలవు. UC బర్కిలీ పరిశోధకుల ప్రకారం మేకలు తలదించి మేస్తున్నప్పుడు కూడా తల తిప్పకుండా 50డిగ్రీల వరకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలవు. ఇది మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి మేసే జంతువులకు తప్పించుకోవడానికి సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది.

News October 3, 2025

మధ్యప్రదేశ్‌లో ‘టమాటా వైరస్’ కలకలం

image

MPలోని భోపాల్‌లో టమాటా వైరస్ కలకలం రేపుతోంది. 200 మంది స్కూల్ విద్యార్థులు దీని బారినపడ్డారు. ఈ వైరస్ సోకినవారు చేతులు, కాళ్లు, అరికాళ్లు, మెడ కింద తీవ్రమైన దురదతో బాధపడుతున్నారు. దద్దుర్లు తర్వాత పొక్కులుగా మారుతున్నాయి. ఒళ్లంతా మంట, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది సులభంగా సోకుతోందని, బాత్రూమ్ వెళ్లినపుడు చేతులు సరిగ్గా కడుక్కోవాలని అధికారులు సూచించారు.

News October 3, 2025

కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

image

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.