News February 24, 2025
పురుష వైద్యులు మహిళా సిబ్బందికి రక్షణగా ఉండాలి: ప.బెంగాల్ సీఎం

వైద్య రంగంలో పనిచేస్తున్న పురుషులు తమతో పని చేసే మహిళా ఉద్యోగులకు రక్షణగా ఉండాలని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రూ.10,000-రూ.15,000 వరకు జీతాల పెంపును ప్రకటించారు.
Similar News
News January 29, 2026
నాపై తప్పుడు ప్రచారం చేశారు: శశి థరూర్

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న MP శశి థరూర్ ఎట్టకేలకు INC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో వారిద్దరిని కలిశారు. సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అనంతరం థరూర్ మీడియాకు చెప్పారు. ‘అంతా బాగానే ఉంది. మేమంతా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఎప్పుడూ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పదవులు అడగలేదు. నాపై తప్పుడు ప్రచారం చేశారు’ అని అన్నారు.
News January 29, 2026
మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
News January 29, 2026
మేడారం జాతర.. రేపు మరో జిల్లాలో సెలవు

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగు జిల్లాలోనూ రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్తో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


