News April 6, 2024

అయోధ్య రాముడిని దర్శించుకున్న మల్లారెడ్డి

image

TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత శంభీపూర్ రాజు కూడా బాలరాముడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ‘శ్రీరాముడు అందరి దేవుడు. బాలరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత మల్లారెడ్డి విహార యాత్రలు, ఆథ్యాత్మిక యాత్రలతో కాలక్షేపం చేస్తున్నారు.

Similar News

News October 24, 2025

ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

image

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.

News October 24, 2025

రాష్ట్రంలో 1,743 పోస్టులు.. అప్లై చేశారా?

image

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే(OCT 28) సమయం ఉంది. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. https://www.tgprb.in/

News October 24, 2025

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.