News January 21, 2025

కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం

image

R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.

Similar News

News January 2, 2026

75 లక్షల ఆర్డర్లు డెలివరీ: జొమాటో CEO

image

డిసెంబర్ 31న రికార్డు స్థాయిలో 75L డెలివరీలు చేసినట్లు జొమాటో, బ్లింకిట్‌ సంస్థల CEO దీపిందర్ గోయల్ తెలిపారు. 4.5లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు 63 లక్షల మందికి వస్తువులు అందజేశారని పేర్కొన్నారు. బెదిరింపులను ఎదుర్కొని, వెనక్కి తగ్గకుండా, ప్రోగ్రెస్‌ను వారు ఎంచుకున్నారని చెప్పారు. ‘ఈ <<18690914>>పని విధానం<<>> అన్యాయమైతే అంతమంది పని చేసేందుకు ఎందుకొస్తారు? వచ్చినా ఎక్కువ కాలం ఎలా కొనసాగుతారు?’ అని ట్వీట్ చేశారు.

News January 2, 2026

త్వరలో 30వేల పోస్టులకు నోటిఫికేషన్

image

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో తపాలా శాఖలో 30వేల జీడీఎస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. టెన్త్‌లో మెరిట్ ఆధారంగా గ్రామ స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. నెలకు BPMకు రూ.18వేలు, ABPMకు రూ.16వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in

News January 2, 2026

‘SIR’ను త్వరగా మొదలుపెట్టండి.. జనసేన సూచన

image

AP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను త్వరగా రాష్ట్రంలో ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జనసేన ప్రతినిధులు భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బలోపేతంగా మార్చేందుకు ఈసీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ SIR, AI వినియోగంపై ప్రతిపాదనలు చేసింది.