News March 13, 2025

హోలీని నిషేధించిన మమతా సర్కారు.. BJP ఫైర్

image

బెంగాల్ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్లో హోలీ వేడుకలను మమతా బెనర్జీ సర్కారు నిషేధించడం వివాదాస్పదంగా మారింది. ఇది యునెస్కో వారసత్వ సంపదని, రంగులు చల్లుకుంటే వృక్ష సంపదకు నష్టమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారిన్ టూరిస్టులు వస్తారు కాబట్టి పండగ జరుపుకోవద్దని బ్యానర్లు కట్టించారు. FRI రంజాన్ ప్రార్థనలు ఉంటాయి కాబ్టటి 10AM లోపే రంగులు చల్లుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై BJP ఆందోళన చేస్తోంది.

Similar News

News March 13, 2025

రోహిత్ శర్మ ఎందుకు రిటైరవుతారు?: డివిలియర్స్

image

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించారు. ‘ప్రస్తుతం రోహిత్ ఆట మామూలుగా లేదు. కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాంటి దశలో ఆయనెందుకు రిటైరవుతారు? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ఆడిన తీరు అసాధారణం. నాయకుడిగా ముందుండి నడిపించారు. రిటైర్ కావడానికి కారణమే లేదు. ఆయనపై విమర్శలకూ స్కోప్ లేదు. ఆయన రికార్డులే ఆ మాట చెబుతాయి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

image

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.

News March 13, 2025

₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

image

భారత్‌లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.

error: Content is protected !!