News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Similar News
News January 2, 2026
ఇంద్రవెల్లి: వృద్ధురాలి వద్ద బంగారం చోరీ

ఇంద్రవెల్లి మార్కెట్లో ఓ వృద్ధురాలి వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
News January 2, 2026
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

కొత్త సంవత్సరం సామాన్యుడికి ధరల షాక్తో ప్రారంభమైంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన చలి వల్ల కూరగాయల దిగుబడి తగ్గి టమాటా, బీర, బెండ కిలో రూ.80-100కు చేరాయి. పచ్చిమిర్చి సెంచరీ దాటగా, మునగకాయ ధర కిలో రూ.400 పలుకుతోంది. చికెన్ కిలో రూ.300, కోడిగుడ్డు ఒక్కోటి రూ.8కు చేరింది. సంక్రాంతి పండుగ వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
News January 2, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సూచనలు (1/2)

మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి కత్తెర పురుగు ఉనికిని గమనించాలి. మొక్కలపై వాటి గుడ్లను గమనిస్తే వేపమందును పిచికారీ చేయాలి. లేత మొక్కజొన్న పంటల్లో 30 రోజుల వరకు ఎకరాకు 15 పక్షి స్థావరాలను, 15 లింగాకర్షక బుట్టలను పైరులో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 9 కిలోల పొడి ఇసుక, కిలో సున్నాన్ని కలిపి మొక్కజొన్న సుడులలో వేస్తే ఇసుక రాపిడికి కత్తెర పురుగు లార్వాలు చనిపోతాయి.


