News February 9, 2025
చిలుకూరు అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 17, 2025
సర్పంచ్ ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

TG: మూడో విడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1,502, BRS 866, BJP 163, ఇతరులు 325 చోట్ల గెలిచారు. 26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆదిలాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాల్లో BRS లీడ్లో ఉంది. జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్-BRS మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది.
News December 17, 2025
పురుషుల ఖాతాల్లోకి రూ.10వేలు.. అధికారులకు తిప్పలు

బిహార్లో అధికారులకు కొత్త తంటాలు వచ్చి పడ్డాయి. మహిళలకు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం ద్వారా రూ.10వేలు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని గ్రామాల్లో పొరపాటున ఈ డబ్బులు పురుషుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో వాటిని రికవరీ చేసేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా ఆ డబ్బు ఖర్చు చేసినట్లు వారు పేర్కొన్నారు. తాము డబ్బు ఇవ్వలేమని, తమను క్షమించాలని సీఎంను కోరుతున్నారు.
News December 17, 2025
నేను పార్టీ మారలేదు.. స్పీకర్కు కడియం వివరణ

TG: తాను కాంగ్రెస్లో చేరలేదని, పార్టీ మారాననేది పచ్చి అబద్ధం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్కు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కడియంకు నోటీసులు ఇవ్వగా రెండు రోజుల క్రితం ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల కేసులో క్లీన్చిట్ ఇవ్వడంతో కడియం రిప్లై బయటకు వచ్చింది. అటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు.


