News February 19, 2025

మేడిగడ్డ ప్రాజెక్టుపై కేసు వేసిన వ్యక్తి హత్య

image

TG: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై దుండగులు కత్తితో దాడి చేశారు . తీవ్ర గాయాలపాలైన ఆయన ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు వేయగా.. KCR, హరీశ్ రావుకు జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై రేపు HCలో విచారణ ఉండగా, నేడు ఆయన హత్యకు గురయ్యారు.

Similar News

News December 19, 2025

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్స్ తక్కువ ప్రమాదకరమా?

image

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్‌లు తక్కువ ప్రమాదకరమని తాజా స్టడీలో వెల్లడైంది. డేటైమ్‌లో న్యూట్రోఫిల్స్ యాక్టివ్‌గా ఉండడంతో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి గుండెకు నష్టం ఎక్కువ జరుగుతున్నట్టు గుండెపోటుకు గురైన 2వేల మంది రికార్డులు పరిశీలించి గుర్తించారు. CXCR4 రిసెప్టర్లు పెంచి న్యూట్రోఫిల్స్ కదలికలను నియంత్రించే పరిశోధనలను ఎలుకలపై చేపట్టారు. న్యూట్రోఫిల్స్‌ తీవ్రతను తగ్గించే మందుల తయారీపై దృష్టిపెడుతున్నారు.

News December 19, 2025

సౌతాఫ్రికా దూకుడు.. 10 ఓవర్లలోనే 118

image

భారత్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా దుమ్మురేపుతోంది. 10 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 118 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్ (65*), బ్రెవిస్ (29*) చెలరేగి ఆడుతున్నారు. హెండ్రిక్స్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశారు. భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరి ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.

News December 19, 2025

అమిత్ షాతో చంద్రబాబు భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను వివరించారు. అంతకుముందు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు.