News March 9, 2025
కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్కు సహకరించిన వ్యక్తి హతం

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కిడ్నాప్కు సహకరించిన ముఫ్తీ షా మిర్ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్లో కాల్చి చంపారు. 2016లో కుల్భూషణ్ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.
Similar News
News March 9, 2025
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి: మంత్రి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన 2BHK ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
News March 9, 2025
రేపటి నుంచి ‘జైలర్-2’ షూటింగ్

నెల్సన్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్-2’ సినిమా షూటింగ్ రేపు చెన్నైలో ప్రారంభం కానుంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జైలర్’కు ఇది సీక్వెల్గా రూపొందనుంది. ఈ షెడ్యూల్ రెండు వారాలపాటు కొనసాగనుండగా, ఏప్రిల్లో రెండో షెడ్యూల్ మొదలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
News March 9, 2025
రైలులో ప్రసవించిన మహిళ

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.