News April 8, 2025

ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.

Similar News

News April 17, 2025

2209లో జరిగే కథతో కిచ్చా సుదీప్ మూవీ

image

హీరో కిచ్చా సుదీప్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. 2209లో జరిగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇందులో వినూత్నమైన సాహస యాత్రను ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనుప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని వారు తెలిపారు.

News April 17, 2025

రాజీవ్ యువ వికాసం.. రెండు దశల్లో డబ్బులు

image

TG: రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.

News April 17, 2025

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

image

AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును CBIకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రవీణ్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!