News September 13, 2025

ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

image

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు చేయడంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే’ ’ అని ఆమె తెలిపారు.

Similar News

News September 13, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం 4 గంటలలోపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్, నల్గొండ, సిద్దిపేటలో వాన పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హన్మకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది.

News September 13, 2025

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు

image

TG: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని BRS నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘జాబ్స్‌ కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు చెబుతున్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలనుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంకతో చెప్పించి రేవంత్ మోసం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.

News September 13, 2025

మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

image

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్‌ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.