News September 28, 2024

CM చంద్రబాబుకు మంచు విష్ణు గిఫ్ట్

image

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన CBN చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా గురించి వివిధ విషయాల గురించి ఆయన అడిగినట్లు ట్వీట్ చేశారు.

Similar News

News September 28, 2024

త‌దుప‌రి హెజ్బొల్లా చీఫ్ స‌ఫీద్దీన్‌?

image

హెజ్బొల్లా చీఫ్ న‌స్రుల్లా మృతితో అత‌ని వార‌సుడిగా హషేమ్ సఫీద్దీన్ నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని స్థానిక మీడియా చెబుతోంది. న‌స్రుల్లా బంధువైన స‌ఫీద్దీన్ ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలను, సైనిక చ‌ర్య‌ల‌ను పర్య‌వేక్షించే జిహాద్ కౌన్సిల్‌లో చురుగ్గా ఉన్నాడు. 2017లో US ఇత‌న్ని ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది. హెజ్బొల్లా కీల‌క నేత‌ల మృతిపై ప్ర‌తీకారం త‌ప్ప‌ద‌ని గ‌తంలోనే స‌ఫీద్దీన్ హెచ్చ‌రించాడు.

News September 28, 2024

మీకు తెలుసా? 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు!

image

1908లో ఇదే రోజు (సెప్టెంబర్ 28) మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్‌లో 15,000 మంది మరణించారు. కొన్ని గంటల్లోనే 48 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ ఉప్పొంగింది. వందల చెరువుల కట్టలు తెగి దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు నగరంలో ప్రవహించింది. అయితే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని చింత చెట్టును ఎక్కి 150 మంది ప్రాణాలను కాపాడుకున్నారు. 2 రోజులు దానిపైనే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ చెట్టు బతికే ఉంది.

News September 28, 2024

MLA కొలికపూడిపై CMకు ఫిర్యాదు

image

AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, బెదిరిస్తున్నారని వారు సీఎంకు తెలిపారు. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.